టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు.వీరిద్దరు తమదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ప్రేక్షక ఆధరణ సంపాదించారు.
నటుడి గానే కాకుండా గాయకులుగాను రాణిస్తున్నారు.పవన్ కళ్యాణ్ జానపద గీతాలను ఆలపిస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ప్రేమ పాటలు పడుతూ వస్తున్నాడు.
తాజాగా వీరిద్దరూ మరోసారి గొంతు సవరిస్తున్నారు.క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించేందుకు సిద్దం అవ్వుతున్నాడు.
ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ జానపద గీతాన్ని ప్రేక్షకులకు మరియు అభిమానులకు వినిపించానున్నాడు.అలాగే తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ చిత్రన్నికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన కుట్టి స్టొరీ అంటే సాగే ఈ సాంగ్ సంగీత ప్రియులను బాగా అలరిస్తుంది.
కుట్టి స్టొరీ అనే సాంగ్ ను విజయ్ మరియు అనిరుద్ లు కలిసి పాడటంతో మంచి ఆధరణ లభిస్తుంది.మాస్టర్ చిత్రం ను తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ సంస్థ విడుదల చేస్తుంది.
ఇప్పుడు ఆ హిట్ సాంగ్ ను ఎన్టీఆర్ తో పాడిస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి అని తలచి ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.త్వరలోనే కుట్టి స్టొరీ అంటూ సాగే సాంగ్ ను ఎన్టీఆర్ స్వరం ద్వార తనదైన స్టైల్ లో పాడనున్నాడు.