తెలుగు సినిమా లకు ఓవర్సీస్ లో భారీ బిజినెస్ లు జరగడం మనం కరోనా ముందు చూశాం.ఈమద్య కాలంలో ఓవర్సీస్ లో తెలుగు సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయితే అక్కడ కనీసం కోటి కాదు కదా కనీసం అర కోటి సాధించడమే చాలా కష్టం అయ్యింది.అక్కడ ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తుంది.
పెద్ద ఎత్తున ఓవర్సీస్ లో సినిమా లు విడుదల అయ్యి మళ్లీ అక్కడ బాక్సాఫీస్ గల గల అనేది ఎప్పుడో అర్థం అవ్వడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పవన్ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి.
మహేష్ తర్వాత ఆ స్థాయిలో అక్కడ క్రేజ్ ఉన్నది పవన్ కు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే ఓవర్సీస్ లో పవన్ సినిమా లు కాస్త ఎక్కువ రేటుకే అమ్ముడు పోతున్నాయి.
పవన్ సినిమా లు ప్రస్తుతం నాలుగు లైన్ లో ఉన్నాయి.మొత్తం నాలుగు సినిమాల్లోకి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుండే క్యూ కడుతున్నారు.వకీల్ సాబ్ ఎలాగూ రీమేక్ సినిమా కనుక ఓవర్సీస్ లో ఆడటం కష్టమే.
ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా పట్ల కూడా అక్కడి వారు ఆసక్తిగా లేరు.కేవలం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పైనే ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
ఈ సినిమా ను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు.క్రిష్ పీరియాడిక్ డ్రామా గా పవన్ తో సినిమా చేస్తున్నాడు.
పవన్ దొంగ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఖచ్చితంగా 200 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.
ఓవర్సీస్ లో ఆ సినిమా కు మరో రేంజ్ లో క్రేజ్ ఉంది.