పవన్ కళ్యాణ్, క్రిష్ల కాంబినేషన్లో రూపొందబోతున్న చిత్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.కథ ఏంటీ, హీరోయిన్ ఎవరు అనే విషయాలపై మీడియాలో వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
క్రిష్కు పాన్ ఇండియా క్రేజ్ ఉంది.బాలీవుడ్లో ఈయన ఇప్పటికే పలు సినిమాలు చేసి అక్కడ నిరూపించుకున్నాడు.
అందుకే ఈ చిత్రంను అక్కడ కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో యూనివర్శిల్ కాన్సెప్ట్ను ఎంపిక చేసుకోవడం జరిగింది.
బాలీవుడ్లో ఈ చిత్రంను విడుదల చేయడం కోసం సినిమా కథను చాలా ప్లాన్డ్గా రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నాడు అనే వార్తలు మొదటి నుండే వస్తున్నాయి.చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే పవన్ దొంగల ముఠ కోహినూర్ వజ్రంను మెగలులా సామ్రాజ్యం నుండి దొంగిలించాలని నిర్ణయించుకుంటారు.
అందుకోసం ఏం చేశారు అనేది సినిమా కథ.
మెగలుల సామ్రాజ్యంలో కోహినూర్ వజ్రంకు చాలా కట్టుదిట్టమైన భద్రత ఉండేది.కోటలోకి వెళ్లాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది.అలాంటిది ఒక సామాన్యమైన దొంగల ముఠా ఎలా ఆ వజ్రంను కొట్టేసింది, అందుకోసం వారు వేసిన ప్లాన్ ఏంటీ అనేది సినిమా మొత్తం ఉంటుంది.
సినిమా కథ మొత్తం కూడా ఆ వజ్రంపైనే ఆధారపడి ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దొంగగా పవన్ ఎలా ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.