పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి లాయర్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నివేథ థామస్, అనన్య పాండే తదితరులు నటించారు.
రాజకీయాల్లో నుంచి చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ఒకపక్క లాయర్ సాబ్ సినిమాలో నటిస్తూనే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రానికి ఓకే చెప్పాడు.అంతేగాక ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ తన 27వ చిత్ర షూటింగ్ గురించి పలు వార్తలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ట్లు, అంతేకాక ఇందులో మొదటగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు పలు కథనాలు వినిపిస్తున్నాయి.అంతేగాక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఆడిపాడిన టువంటి ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కనీసం ఇప్పటికైనా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ చిత్రంపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు.