గత ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో మినహా మెగా ఫ్యాన్స్ కు సినిమాలు ఏమీ విడుదల కాలేదు.చిన్న పెద్ద మెగా హీరోలు ఎవరు కూడా గత ఏడాది కరోనా కారణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చేయలేదు.
ఏడాది చివర్లో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరియు చిరంజీవి ఆచార్య సినిమాలు కేవలం నెల రోజుల గ్యాప్ లోనే విడుదల కాబోతున్నాయి.
ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ హడావుడిగా చిత్రీకరిస్తున్నారు.గత ఏడాదిలో రావాల్సిన ఈ సినిమా సంక్రాంతికి అన్నారు.
ఇంకా కూడా విడుదల కాలేదు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే 9వ తారీకున ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఆచార్య సినిమా కంటే కాస్త ముందు అంటే ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ విడుదల కాబోతుంది.ఇన్నేళ్ల మెగా ఫ్యామిలీ కెరీర్ లో ఇలా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల సినిమాలు ఒకే సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
మెగా హీరోలు 2021 లో దాదాపుగా డజను సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.వకీల్ సాబ్ తో మెగా హీరోల బాక్సాఫీస్ వార్ మొదలు అవ్వబోతుంది.
ఉప్పెన సినిమాను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.రికార్డు స్థాయి వసూళ్లు టార్గెట్ గా వకీల్ సాబ్ మరియు ఆచార్య సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అయితే సినిమా షూటింగ్ లు మాత్రం కాస్త ఆలస్యం అయిన కారణంగా విడుదల విషయంలో పోటీ పడాల్సి వస్తుంది.ఆచార్య సినిమాలో చరణ్ నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
.