పవన్ కళ్యాణ్ తో పదేళ్లు గా సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజుకు వకీల్ సాబ్ సినిమా తో ఆ కోరిక తీరింది.వకీల్ సాబ్ సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.
వందల కోట్ల మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ తో ఒక మంచి మాస్ మసాలా సినిమా ను నిర్మించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు చర్చలు జరుపుతున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ను రెడీ చేయాల్సిందిగా అనీల్ రావిపూడికి సూచించాడట.
ఆ స్క్రిప్ట్ తో పవన్ ను సంప్రదిస్తే ఖచ్చితంగా మళ్లీ తన బ్యానర్ లో నటిస్తాడనే నమ్మంకతో పవన్ ఉన్నాడు.అందుకే కొందరు దర్శకులు రెడీ చేసిన కథలు విన్న దిల్ రాజు చివరకు అనీల్ రావిపూడి కథ అయితేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు.
పెద్ద ఎత్తున పవన్ కళ్యాన్ తో సినిమా ను నిర్మించి వందల కోట్ల లాభాలను దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న దిల్ రాజుకు అనీల్ రావిపూడి ఆశగా కనిపిస్తున్నాడు.
ఎఫ్ 3 సినిమా ను ప్రస్తుతం అనీల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు.ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా తదుపరి సినిమా ను మహేష్ బాబుతో చేయాలని భావిస్తున్నాడు.అందుకు సంబంధించిన కథ మరియు కథనాలను సిద్దం చేయాల్సిందిగా గతంలోనే మహేష్ బాబు సూచించాడు.
కాని ఇప్పుడు దిల్ రాజు మాట మేరకు పవన్ కళ్యాణ్ ను ఒప్పించేందుకు కథను సిద్దం చేస్తున్నాడు. మహేష్ బాబుతో సినిమా అంటే ఖచ్చితంగా ఏడాది అయినా ఎదురు చూడాల్సి ఉంది.
కనుక ముందే ఒక సినిమా ను చేయాలని అది పవన్ తో అయితే బాగుంటుందని అనీల్ రావిపూడి కూడా కలలు కంటున్నాడు.అతి త్వరలోనే ఈ విషయమై క్లారిటీ ఇచ్చేలా దిల్ రాజు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
పవన్ మంచి మూడ్ లో ఉన్న సమయంలో వకీల్ సాబ్ వల్ల నష్టపోయాను ఆదుకోండి అంటూ కోరితే తప్పకుండా సాయం చేస్తాడు అనే నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేస్తున్నాడట.మరి రాజు గారి విశ్వ ప్రయత్నాలు ఏమేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.