జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ముందు రోజులు అన్నీ మంచిగా ఉండబోతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.ఏపీలో ప్రజలకి చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకత ఎవరికి కలిసొస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కి మాత్రమేనని ఘంటాపథంగా చెప్తున్నారు.
అంతేకాదు రాజకీయంగా కీలకమైన జిల్లాగా.ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న జిల్లాగా పేరొందిన పశ్చిమలో పవన్ కళ్యాణ్ దాదాపు తెలుగు దేశం కోటలని కొల్లగొట్టడానికి సిద్దంగా ఉన్నాడని తెలుస్తోంది.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బ్రతికించుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారో అప్పటినుంచీ బాబు కి బ్యాడ్ టైం మొదలయ్యింది అంటున్నారు విశ్లేషకులు.అసలు కాంగ్రెస్ తో పొత్తుని తెలుగుదేశంలోని నేతలే జీర్ణించుకోలేక పోతుంటే ఒట్లువేసి గెలిపించిన ప్రజలు ఇంకెలా చంద్రబాబు నిర్ణయాల్ని స్వాగతిస్తారు అనేది లాజిక్ ఇప్పుడు ఇదే చంద్రబాబుకి ఏపీలో గెలుపుని దూరం చేయనుంది అంటున్నారు.
పశ్చిమలో గత ఎన్నికల్లో 15 స్థానాలకి 15 తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు నాయుడు ఈ సారి మాత్రం ఘోరంగా దెబ్బతినడం ఖాయంగా తెలుస్తోంది.ఇప్పటికే జగన్ వైపు దాదాపు పశ్చిమ ప్రజలు మొగ్గు చూపుతుండగా తాజాగా బాబు పై ఉన్న వ్యతిరేకతతో పశ్చిమలో దాదాపు ఐదు స్థానాలు జనసేన పార్టీకి పట్టం కట్టేలా ఉన్నాయి అనేది తాజాగా తెలుస్తోంది.ఇంతకీ జనసేన ఖాతాలో జమ అయ్యే ఆస్థానాలు ఇవే అంటూ రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా పశ్చిమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాఖా అయిన పాలకొల్లు లో జనసేన జెండా ఎగరడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.ఇప్పటికే ఈ విషయంలో పవన్ ఫుల్ క్లారిటీ గా ఉన్నాడట.ఇక నరసాపురం లో సైతం జనసేన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో మెగా అభిమానులు అధికంగా ఉండటమే కాకుండా తన సొంత సామాజిక వర్గం అయినా కాపులు,మెగా ఫ్యామిలీ కి ముందు నుంచీ మద్దతు ఇస్తున్న శెట్టి బలిజలు కూడా వెన్నంటే ఉండటం పవన్ కి కలిసోస్తున్న అంశంగా చెప్తున్నారు.ఇక ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లి గూడెం లలో సైతం జనసేన జెండా ఎగరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి చంద్రబాబు కాంగ్రెస్ దోస్తీ పవన్ కి బాగానే కలిసోచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు.