ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రోడ్ల మరమ్మతులు కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ 2200 కోట్లు కేటాయించడం జరిగిందని.
తెలిపారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి వర్షాలు పడుతున్న సమయంలో.
రోడ్ల మరమ్మతులు కార్యక్రమం కి ఆటంకం ఏర్పడింది అని వర్షాలు తగ్గిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 12 సంవత్సరాలలో ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు అని, అయితే ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబుతో కలిసి.
రాజకీయాలు చేస్తారన్న విషయం స్పష్టంగా అర్థమైంది అని చెప్పుకొచ్చారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని.
చెప్పిన పవన్.ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు.
అంటూ సెటైర్లు వేశారు.అదేవిధంగా వైసీపీ పై ఎటువంటి యుద్ధం ప్రకటించారు.
అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు.ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్ళ యుద్ధం గురించి మాట్లాడతారు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కి… ఒక కులాన్ని అంటగట్టిన పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం పవన్ తెగ తాపత్రయ పడుతున్నారు అని విమర్శించారు.పక్క రాష్ట్రాల్లో ఉండే పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి గురించి ఏం తెలుస్తాయి అంటూ ఎద్దేవా చేశారు.