అమీషా పటేల్ రెండు దశాబ్దాల క్రిందట హృతిక్ రోషన్ పక్కన కహోనా ప్యార్ హై సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన బద్రి సినిమాలో నటించింది.
ఆ తర్వాత మహేష్బాబు, ఎన్టీఆర్ పక్కన చేసినా ఆమెకు తెలుగులో అంత క్రేజ్ రాలేదు.కోలీవుడ్కు వెళ్లినా అక్కడా సక్సెస్ కాలేదు.
అయితే ఆమె అందం, అభినయంకు మాత్రం కుర్రోళ్లు భలే ఫిదా అయిపోయేవారు.ఇప్పటికే నాలుగున్నర పదుల వయస్సు వచ్చినా అమీషా మాత్రం ఇంకా ఏ 25 ఏళ్ల హీరోయిన్లాగానో ఉండాలని అనుకుంటోంది.
ఎప్పటికప్పుడు తన ముదురు పరువాలతో హోయలు ఒలకబోస్తూ.ఈ వయస్సులో కూడా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.45 ఏళ్ల వయస్సులో కూడా ఇంత హాట్ హాట్గా అందాల ఆరబోత చూస్తుంటే అమీషాకు మళ్లీ వెండితెర మీదో లేదా ఏ వెబ్సీరిస్లలో ఓ వెలుగు వెలగాలన్న కోరిక అయితే ఉన్నట్టు ఉంది.వెండితెర మీద ఈ ఆంటీకి హీరోయిన్ ఛాన్స్ అయితే ఎవ్వరూ ఇవ్వరు.
ఇక ఆమెకు లక్ ఉంటే ఏ వెబ్ సీరిస్లోనే ఛాన్స్ వస్తే రావాలి.
అక్కడ కూడా ఈ వయస్సులో హాట్గా చూపిస్తే కుర్రోళ్లు ఈ ముదురు ఆంటీ అందాలను చూస్తారా ? అన్నది డౌటే.పూర్తిగా ఫేడవుట్ అయినా ఆమె ఫొటోలు చూస్తుంటే కుర్రకారును తన అందాలతో తన వైపునకు తిప్పేసుకుంటానన్న ధీమా ఆమెలో ఉన్నట్టే ఉంది.ఇక ఈ హాట్ అందాలతో ఆమె నార్త్లో కొన్ని ప్రకటనల్లో నటిస్తూ ఆదాయం ఆర్జిస్తోందట.