పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు చాలా ఆతృతగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
సత్యమేవ జయతే అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు వకీల్ సాబ్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ పాటను సెన్సేషనల్ హిట్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ పాట రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో దుమ్ములేపాలని వారు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట.
అంతేగాక ఈ పాటను ట్రెండింగ్లో టాప్ పొజిషన్లో ఉంచేలా వారు సిద్ధమవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ పాట చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని, అందుకే ఈ పాట సినిమాకు బాగా తోడవుతుందనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది.
ఇక ఈ పాట రిలీజ్ కాగానే పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండబోదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా నుండి పాట రిలీజ్ అవుతుండటంతో ఈ పాట సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పవన్ లాయర్ పాత్రలో పవర్ప్యాక్డ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ కాగా ఈ సినిమాలో అందాల భామ నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ కేమియో పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.