2018 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమా విడుదల కాలేదు.జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాలకు దూరం కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నెలల తరువాత పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన పింక్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పింక్ రీమేక్ తెలుగులో వకీల్ సాబ్ పేరుతో దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ కాగా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అయితే టీజర్ లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.
అయితే ఇదే సమయంలో దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.ఈ సినిమాను ఆగష్టు నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.దీంతో పవన్ ఫ్యాన్స్ దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ లో వకీల్ సాబ్ విడుదలవుతుందని ప్రకటనలు వెలువడినా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే దిల్ రాజు నుంచి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
వకీల్ సాబ్ సినిమాకు 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఖర్చు కావడంతో ఆ బడ్జెట్ రికవరీ కావాలంటే కొద్దిరోజులు వేచి చూడాలని దిల్ రాజు భావిస్తున్నాడని తెలుస్తోంది.