తమకు నచ్చిన హీరో పై అభిమానం ఉండడం సహజమే కానీ.అదే అభిమానం పిచ్చిగా మారి ఉన్మాదిగా మార్చేస్తే ఏం జరుగుతుందో అన్నది నిన్న గోపాల గోపాలా ఆడియో పుణ్యమా అంటూ బయటపడింది.
పవన్ కళ్యాణ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన గోపాల గోపాలా ఆడియో నిన్న శిల్పకళా వేదికలో అంగరంగా వైభవంగా జరిగింది.అయితే తమ అభిమాన హీరోనూ చూడాలనే పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఉన్మాదులు మారారు.
ఈ ఆడియో పాస్ లకు భారీ డిమాండ్ పెరగడంతో ఏదో విధంగా పాస్ లు సంపాదించాలి అన్న ప్రయత్నంలో ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ పాస్ ల కోసం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పవన్కల్యాణ్ అభిమాని శ్రీనివాస్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.పవన్ అభిమాని శ్రీనివాస్ ను కత్తితో గొంతు కోసి పాస్లు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు అని టాక్.
ప్రస్తుతం ఈ బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటుండగా ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం పై పోలీసులు విచారణ చేపట్టారు.అంతేకాకుండా దీనికి పాస్ లే కారణమా లేక ఏమైనా ఇతరత్రా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో సైతం విచారణ జరుగుతుంది.
అయితే గాయపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా గంటావారి పాలెంకు చెందిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గా తెలుస్తుంది.ఏది ఏమైనా అభిమానం ఉన్మాదం అయితే ఇలానే ఉంటుందేమో.