ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల హిందీ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.కేవలం హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారానే బడ్జెట్ లో 20 శాతం వరకు నిర్మాతలకు ఆదాయం చేకూరుతోంది.
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో పవన్, రానా కలిసి నటిస్తుండగా తాజాగా లీకైన వీడియో గురించి ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.ఈ సినిమా రీమేక్ హక్కులు ఏకంగా 23 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
సాధారణంగా రీమేక్ సినిమాలు భారీ మొత్తానికి అమ్ముడవడం సాధ్యం కాదు.అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో చేసిన మార్పుల వల్లే ఈ సినిమా ఏకంగా 23 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు వినయ విధేయ రామ హక్కులు ఏకంగా 21 కోట్ల రూపాయలకు అమ్ముడై ఆ సినిమాపై రికార్డు ఉండగా ఆ సినిమా రికార్డులను అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చెరిపేసింది.
మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను 44కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డీల్ ఫైనల్ కావాల్సి ఉందని తెలుస్తోంది.త్వరలో డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
పవన్ సినిమా రీమేక్ హక్కులు కూడా భారీ ధర పలుకుతుండటం గమనార్హం.
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ హక్కులు 44 కోట్ల రూపాయలకు అమ్ముడైతే అది ఒక రికార్డే అవుతుందని చెప్పవచ్చు.బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాకుండా భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన సినిమాల్లో అయ్యపనుమ్ కోషియమ్ మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.పవన్, రానా పాతలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం.
సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.