మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ మరియు రానా లు నటిస్తున్నారు.భారీ అంచనాలున్న ఈ రీమేక్ షూటింగ్ గత వారం ప్రారంభం అవ్వాల్సి ఉంది.
దర్శకుడు సాగర్ చంద్రతో పాటు హీరో పవన్ కళ్యాణ్ మరియు రానాలు కూడా సిద్దం అయ్యారు.హీరోయిన్స్ కూడా డేట్లు ఇచ్చారు.
ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండా నిలిచి పోయింది.షూటింగ్ ప్రారంభం కాక పోవడంకు కారణం సినిమాటోగ్రాఫర్ అంటూ వార్తలు వచ్చాయి.
ఆయన అందుబాటు లో లేకపోవడం వల్ల వారం రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇలాంటి సమయంలో మీడియా సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పవన్ మరియు రానాల సినిమా షూటింగ్ సమయంలో సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడి మద్య విభేదాల కారణంగా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది అంటున్నారు.షూటింగ్ సమయంలో దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.
దర్శకుడితో సినిమాటోగ్రాఫర్ వర్క్ చేసేందుకు ఇష్టంగా లేడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పవన్ మరియు త్రివిక్రమ్ లు ఏం చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్శకుడితో విభేదాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.కనుక షూటింగ్ లో సర్దుకు పోవాలి.కాని సాగర్ చంద్ర తో ఆ సినిమాటోగ్రాఫర్ సర్దుకు పోలేక పోయాడు.దాంతో విభేదాలు తప్పలేదు అంటున్నారు.షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఇద్దరి మద్య విభేదాలే అంటున్నారు.ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ పునః ప్రారంభం కు ఆయన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
షూటింగ్ ప్రారంభించాలంటే కొత్త సినిమాటోగ్రాఫర్ రావాల్సిందే అంటున్నారు.పవన్ మూవీకి వర్క్ చేసేందుకు ఎవరైనా సిద్దంగా ఉంటారు.
కనుక ఈ సినిమా ఖచ్చితంగా మరో సినిమాటోగ్రాఫర్ తో ముగిస్తారనే టాక్ వినిపిస్తుంది.