ఈ మధ్య కాలంలో ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ వేర్వేరు విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం వరకు వీకే నరేష్ తో పెళ్లిపై నోరు విప్పని పవిత్ర లోకేశ్ తాజాగా ఈ విషయాల గురించి స్పందించడంతో పాటు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు.
అయితే పవిత్ర లోకేశ్ 43 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకోవడంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా పవిత్ర లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ ఖాతాలు క్రియేట్ అవుతున్నాయని ఆ ఖాతాలలో తన పరువుకు భంగం కలిగించే వార్తలతో పాటు అసభ్యకరమైన ఫోటోలను వైరల్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఈ విధంగా చేయడం వల్ల తాను వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.
పవిత్ర చెప్పిన విషయాల గురించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు ఇప్పటికే విచారణను మొదలుపెట్టగా త్వరలో నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం పిల్లలతో కలిసి పవిత్ర లోకేశ్ ఒంటరిగా జీవనం గడుపుతున్నారు.పవిత్ర లోకేశ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి.
చిన్న సినిమాలతో పోల్చి చూస్తే పెద్ద సినిమాలకే పవిత్ర లోకేశ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.తర్వాత సినిమాలు కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే పవిత్ర లోకేశ్ పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.పవిత్ర లోకేశ్ పరిమిత సంఖ్యలోనే సినిమాలలో నటిస్తున్నారు.
మరోవైపు పవిత్ర లోకేశ్ గురించి సుచేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె క్యారెక్టర్ గురించి చెడు అభిప్రాయం కలిగేలా సుచేంద్ర వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.