జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.పవన్ ట్విట్ తో జనసేన కార్యకర్తలు ప్రభుత్వం పై నెగటివ్ ట్రోల్స్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇటీవల జనసేన ప్రభావం కనిపించే ఏరియాల్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు చేపట్టారు.దీంతో పవన్ ఈ విషయంపై ఇప్పుడు స్పందించినట్టుగా కనిపిస్తోంది.
‘‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం.ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం.మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను.Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.
’ ’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.ఓ ఇంగ్లీష్ ప్రతికలో టీడీపీ నేతలు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని ఫోటో తీసి.దానికి పైవిధంగా క్యాప్షన్ ఇచ్చి.పవన్ ట్వీట్ చేశారు.
మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.