టిడిపి అధినేత చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానంపై పెద్ద దుమారమే చోటు చేసుకుంది.తన భార్యను అవమానించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీనిపై ఆయనకు పెద్ద ఎత్తున సానుభూతి అన్ని వర్గాల నుంచి వస్తోంది.అలాగే తెలుగుదేశం పార్టీ లోనూ కసి, ఉత్సాహం పెరగడంతో, ఈ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని మరింత బలపడేందుకు టిడిపి ప్లాన్ చేసుకుంటూ ఉండగా, టిడిపికి కలిసి వచ్చిన ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది.
ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న, ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళినా, జనసేన కు పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు అని, ప్రస్తుతం టిడిపికి ప్రజల్లో పెరిగిన ఆదరణ నేపథ్యంలో, ఆ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయంలో ఉన్నట్టు గా తెలుస్తోంది.
ఇప్పటికే టిడిపి నుంచి జనసేన కు రాయబారాలు నడిచిన నేపథ్యంలో, పవన్ సైతం పొత్తు కు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికి ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన , టిడిపి చాలాచోట్ల ఉమ్మడిగా పోటీ చేశాయి .టిడిపి అభ్యర్థి ని నిలిపిన చోట జనసేన పోటీకి దూరంగా ఉండగా , జనసేన కు చాలా చోట్ల టిడిపి మద్దతు ప్రకటించింది .అయితే ఇదంతా స్థానిక నాయకులు నిర్ణయం మేరకే జరిగాయి అని ప్రకటించినా, పై స్థాయి నుంచి ఆదేశాలు రావడంతో ఈ విధమైన వ్యవహారాలు చోటుచేసుకున్నాయనే విషయం స్పష్టం అవుతోంది.
2024 ఎన్నికల నాటికి జనసేన ను ఏపీలో బలోపేతం చేయాలన్న , ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి .అలాగే జనసేన కు మీడియా సహకారం కూడా పెద్దగా లేకపోవడంతో, టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఒక వర్గం మీడియా మద్దతు పూర్తిగా లభిస్తుందని , జనసేన వాయిస్ జనాల్లోకి వెళ్తుందనే అంచనా వేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం బీజేపీని కూడా ఒప్పించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడమా లేక బిజెపితో సైతం పొత్తు రద్దు చేసుకుని టీడీపీ తో ముందుకు వెళ్ళడమా అనే విషయంపైనే పవన్ ఆలోచనలో పడ్డారట.