ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడు స్నేహం చిగురిస్తుందో, ఎప్పుడు శత్రుత్వం చెలరేగుతుందో చెప్పలేని పరిస్థితి.అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది.
ఇక విషయానికి వస్తే మొన్న విశాఖలో పవన్ చేపట్టిన ఇసుక దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.పవన్ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరగా టీడీపీ స్పందించి ఆ సభకు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులను పంపించింది.
ఇప్పుడు చంద్రబాబు కూడా రేపు దీక్షకు దిగబోతున్న నేపథ్యంలో పవన్ మద్దతు కోరేందుకు టీడీపీ నేతలు అచ్చెన్న, వర్ల రామయ్య పవన్ ను కలిశారు.
చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపడంతో పాటు స్వయంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
దీనికి పవన్ జనసేన తరఫున మద్దతు ఇస్తామని చెప్పారట.దీక్షకు మద్దతు తెలిపినందుకు పవన్ కు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇసుక, కార్మికుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం నాయకులు.జగన్ పాలన వల్ల రాష్టం పరువు రోడ్డున పడిందని విమర్శించారు అచ్చెన్నాయుడు.