జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రులకు మధ్య గత కొద్ది రోజులుగా రాజకీయ, వ్యక్తిగత దూషణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పవన్ టార్గెట్ గా మంత్రులతో పాటు, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కొంత మంది వ్యక్తులు పవన్ పై దూషణలకు దిగారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీలోని మంగళగిరిలో పర్యటించబోతున్నారు.దీంతో ఏపీ లో నేడు ఏం జరగబోతుంది అనే టెన్షన్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
వైసిపి నేతలను ఉద్దేశించి తాజాగా పవన్ చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ఇదే ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి హిందూ దేవాలయాలు, హిందూ దేవతా మూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు.
వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే ! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.ఎక్కడ ఉన్నాయి వై.సి.పి గ్రామ సింహాలు .
అంటూ పవన్ ట్వీట్ చేయడంతో దేవాలయాలపై జరిగిన దాడుల వ్యవహారం పైన జనసేన ఉద్యమం మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది .వైసిపి మంత్రులు , ఎమ్మెల్యేలు, నాయకులు అంతా పవన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండగా, పవన్ సైతం ట్విట్టర్ ద్వారా అనేక అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.దీంతో ఈ రోజు మంగళగిరి పర్యటన పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది.వైసిపి కనుక పవన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దానికి దీటుగానే జనసేన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికీ పవన్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సినీనటుడు మాటల రచయిత పోసాని కృష్ణ మురళి పై కొంతమంది పవన్ అభిమానులు దాడి చేసి ఆయనను గాయపరిచారు.