అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం త్వరలో పూర్తవనున్న నేపధ్యంలో ఆ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి.ప్రముఖ సెలబ్రెటీల నుండి అన్ని రంగాల వారు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం తిరుపతికి వచ్చిన జనసేనాని ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం అందించానని ప్రకటించారు.అదీగాక తన కార్యవర్గంలో ఉన్న ఇతర మతాలకు చెందిన ప్రతి వారు కూడా రూ.11 వేలు అందించారని, దాని తాలూకు డీడీని కూడా అందిస్తున్నానని పేర్కొన్నారు.
అంతే కాదు శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని కూడా ఈ సందర్భంగా వివరిస్తూ చివరిగా అన్ని వర్గాలు సామరస్యంగా కలసి మెలసి ఈ భారతదేశం విలసిల్లుతుందంటే అది రాముడి చలవేనని అని, అందుకే ఈ దేశాన్ని రామరాజ్యం అంటామని తెలిపారు.