జనసేన ఇక శర వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే ముమ్మిడివరం అసెంబ్లీ సీటులో బాలకృష్ణ అనే అభ్యర్థిని ప్రకటించగా… తాజాగా మరో ఇద్దరి పేర్లను పవన్ కన్ఫర్మ్ చేశారు.
పవన్ కోటరీలో కీలకంగా ఉన్న తోట చంద్ర శేఖర్ కు గుంటూరు పార్లమెంట్ సీటు కేటాయించగా….తెనాలి అసెంబ్లీ స్థానానికి నాదెండ్ల మనోహర్ పేరును ఖరారు చేశారు.
ఏలూరు ఎంపీ స్థానం నుంచి 2014 లో పోటీ చేసిన తోట చంద్ర శేఖర్ తన వల్లే ఓడిపోయారని… అందుకే ఆయన్ను జనసేనలోకి ఆహ్వానించి తగిన ప్రాధాన్యత కల్పించామని పవన్ ప్రకటించారు.తాను ఏది చేసినా తన అభిమానులందరికీ చెప్తానని ….మోసం మాత్రం చేయనని పవన్ తేల్చి చెప్పారు.