టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండబోతున్నట్టు …టీడీపీ ఎంపీ టీజీ వ్యాఖ్యలపై అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో పార్టీ కార్యకర్తలను… ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు.
ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు.
ఇక ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించారు.పిచ్చి పిచ్చిగా మాట్లాడితే… వదిలే ప్రసక్తి లేదని… అసలు జనసేన వద్దు అనుకుంది కాబట్టే మీకు రాజ్యసభ టికెట్ దక్కింది.పెద్ద మనిషిగా మాట్లాడు లేదంటే… నేను నోరు అదుపు తప్పి మాట్లాడతా .నేను నోరు విప్పితే మీరేమవుతారో అంటూ… ఘాటు వ్యాఖ్యలు చేశారు.