అమెరికా మాజీ ట్రెజరీ కార్యదర్శి పాల్ ఓ నీల్ కన్నుమూశారు.గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం పీట్స్బర్గ్లో తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 84 సంవత్సరాలు.జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పాల్ ట్రెజరీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన చిత్తశుద్ధి, నిర్ణయం తీసుకోవడంలో డేటా ఆధారిత విధానం, ప్రజా సేవ పట్ల అంకిత భావం, తదితర సుగుణాలతో పాల్ ఓ నీల్ గుర్తింపు తెచ్చుకున్నారని ఇండియానా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ముక్కుసూటిగా వ్యవహరించే పాల్… బుష్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రెండేళ్ల పాటు ట్రెజరీ కార్యదర్శిగా వ్యవహరించారు.
అయితే 2002 డిసెంబర్లో ఫెడరల్ ప్రభుత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో బుష్ ఆగ్రహానికి గురై పదవిని కోల్పోయారు.అలాగే రాన్ సుస్కిండ్ రచించిన ‘‘ ది ప్రైస్ ఆఫ్ లాయల్టీ: జార్జ్ డబ్ల్యూ బుష్, వైట్ హౌస్, ఎడ్యుకేషన్ ఆఫ్ పాల్ ఓ నీల్ పుస్తకాల ప్రచురణలో పాల్ కీలకపాత్ర పోషించారు.

పాల్ సత్యాన్ని విశ్వసించేవాడని.చివరికి అదే అతనిని తొలగించిందని.ఆయన నిజమైన అమెరికన్ హీరో అంటూ సుస్కిండ్ ట్వీట్ చేశారు.అమెరికా పెను సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో పాల్ దేశానికి అద్భుతమైన సేవలు అందించారని ప్రస్తుత ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ ట్వీట్ చేశారు.
పాల్ ఓ నీల్ సెయింట్ లూయిస్లో జన్మించారు.రిచర్డ్ నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ వంటి ఉద్దండుల ఆధ్వర్యంలో అమెరికా బడ్జెట్ కార్యాలయంలో పలు ఉన్నత పదవుల్లో పనిచేశారు.2019లో ఇండియానా యూనివర్సిటికి చెందిన అల్మా మేటర్కు పాల్ 30 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.దీంతో ఆయన గౌరవార్థం దీనిని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హానర్స్గా మార్చారు.
పాల్ ఓ నీల్కు భార్య, నలుగురు పిల్లలు, 12 మంది మనుమలు, 15 మంది ముని మనుమలు ఉన్నారు.