దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులపై వ్యాపారం చేసే పతంజలి సంస్థకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.సంప్రదాయ ఆయుర్వేద మందులని అందిస్తున్న పతంజలి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ వేల్యూ ఉంది.
దీనికి రామ్ దేవ్ బాబా ప్రచారకర్తగా ఉండటంతో పాటు వ్యాపార భాగస్వామి కూడా.అయితే కరోనా వైరస్ కి వాక్సిన్ తయారు చేసే పనిలో ఫార్మా సంస్థలు ఇప్పుడు తలమునకలై ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే పతంజలి కూడా కరోనాకి మందు కనిపెట్టిందని ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబందించిన క్లీనికల్ ట్రయిల్స్ కూడా సక్సెస్ అయ్యాయని ప్రకటించింది.
పతంజలి ప్రకటనతో కలకలం మొదలైంది.పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసు జారీ చేసింది.
మరో వైపు పతంజలి ప్రోడక్ట్ మార్కెట్ లోకి రావడం ఇష్టం లేని వారు దీని మీద సోషల్ మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేశారు.ఫలితంగా ఈ సంస్థ యూటర్న్ తీసుకుంది.
తాము కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి మందును తయారు చేయలేదని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖకు తెలిపింది.కరోనా కిట్ పేరుతో తాము ఒక ప్యాకేజీని రెడీ చేశామని, ఇందులో దివ్య స్వాసరి వాతి, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్, దివ్య అను తైలం ఉంటాయని పతంజలి చెప్పింది.
కరోనిల్ కిట్ పేరుతో తాము ఇంత వరకు కమర్షిషల్ గా అమ్మలేదని తెలిపింది.కరోనా వ్యాధిని ఈ మందు నయం చేస్తుందని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పింది.
ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని మాత్రమే తాము మీడియా సమావేశంలో చెప్పామని తెలిపింది.ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే తాము వెల్లడించామని పేర్కొంది.
ఇప్పటికే కరోనా మెడిసన్ అంటూ తప్పుడు ప్రచారం చేసారనే అభియోగాలతో రామ్ దేవ్ బాబా ని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపధ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆలోచించాలి.