జనసేన పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అంతా కూడా మెల్లగా జారుతున్నారు.
కనీసం అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవక పోవడంతో ఆ పార్టీ నాయకులకు అస్సలు నమ్మకం లేదు.మళ్లీ ఎన్నికల్లో అయినా జనసేన అధికారంలోకి వస్తుందో లేదో అనే అనుమానాలతో ఆ పార్టీ నాయకులు చాలా మంది కూడా పక్క పార్టీలను చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.పార్టీలో తనకు కీలక పదవులు ఇచ్చి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు.
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వకున్నా వైకాపాలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
బీజేపీలోకి కూడా ఆయన వెళ్లడం జరుగుతుందని కొందరు అంటున్నారు.వైజాగ్లో పసుపులేటి రాజీనామాతో జనసేనకు పెద్ద దెబ్బ అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
రేపు వైజాగ్లో జనసేన లాంగ్ మార్చ్ ఉంది.దాన్ని కాదని ఇప్పుడు రాజీనామా చేసిన బాలరాజుపై జనసైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు.