ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటులలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.ఏడు పదుల వయస్సులో కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా రజినీకాంత్ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
తమిళంతో పాటు తెలుగులో, ఇతర భాషల్లో కూడా రజినీకాంత్ పాపులారిటీని సంపాదించు కున్నారు.ప్రముఖ నటుడు పసునూరి శ్రీనివాసులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను సినిమాలలో ఆఫర్ల కోసం తిరుగుతున్న సమయంలో ఒక నిర్మాత తనను ఘోరంగా అవమానించారని ఆయన తెలిపారు.జీవితంలో ఎవరినీ అవమానించ కూడదని ఆయన అన్నారు.
నేనే గొప్ప అని అనుకుంటే అతని కంటే గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉంటారని పసునూరి శ్రీనివాసులు వెల్లడించారు.గాడ్ ఈజ్ గ్రేట్ అని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు తాను స్మాల్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు మంచి స్థాయికి వచ్చానని ఆయన చెప్పు కొచ్చారు.
ఎవరైనా ఎప్పుడైనా మంచి స్థాయికి ఎదగవచ్చని ఆయన అన్నారు.
రోబో సినిమా షూటింగ్ సమయంలో నా కొడుకు రజనీకాంత్ ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడని తాను అదే విషయాన్ని రజినీ కాంత్ తో చెబితే వై నాట్.గివ్ మీ పేపర్ అని ఆయన అన్నారని పసునూరి శ్రీనివాసులు వెల్లడించారు.తన కొడుకు పేరు రజినీకాంత్ అడగడంతో పాటు ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత తన కొడుకు పేరుతో పాటు గాడ్ బ్లెస్ యూ అని రాశారని పసునూరి శ్రీనివాసులు చెప్పుకొచ్చారు.
ఆ ఆటోగ్రాఫ్ ఇప్పటికీ ఉందని పసునూరి శ్రీనివాసులు పేర్కొన్నారు.తనకు రాజకీయాలంటే ఇష్టం కాబట్టి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.రాజకీయ నాయకులలో అందరూ వైట్ ఎక్కువగా ఉపయోగిస్తారని అందువల్ల తాను ఈ రంగుపై ఆసక్తి చూపించానని పసునూరి శ్రీనివాసులు కామెంట్లు చేశారు.