వలస నాయకులకు పెద్ద పీట వేస్తున్న గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఅర్ ఎట్టకేలకు నికార్సైన టీఆరెస్ నాయకుడికి వరంగల్ ఉప ఎన్నిక కోసం టిక్కెట్ ఇచ్చారు.మరో విధంగా చెప్పాలంటే ఒక శిల్పికి టిక్కెట్ ఇచ్చి గౌరవించారు.
ఆయనే పసునూరి దయాకర్.వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో గులాబీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.తెలంగాణా తల్లి విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు దయాకరే.2001 నుంచి అంటే గులాబీ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్కు విధేయుడిగా ఉన్నా ఎప్పుడూ టిక్కెటు ఇవ్వలేదు.కొన్ని సార్లు చేతికి వచ్చిన అవకాశం వేరే కారణాల వల్ల చేజారి పోయింది.మంత్రి తారక రామారావ్ గట్టిగా ప్రయత్నించక పొతే దయాకర్కు టిక్కెటు వచ్చేది కాదు.
దానికి తోడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా మద్దతు ఇచ్చారు.ఉప ఎన్నికలో గెలుపు మీద గులాబీ పార్టీ నాయకులు గట్టి భరోసాతో ఉన్నారు.
కడియం శ్రీహరి కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందా అన్నదే ప్రశ్న.గత ఎన్నికల్లో కడియంకు దాదాపు 4 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది.
కానీ ప్రస్తుతం కెసీఆర్ సర్కారుకు వ్యతిరేకత ఉంది కాబట్టి మెజారిటీ తగ్గవచ్చు.బహుశా ఓటమి ఎదురు కాకపోవచ్చని అనుకుంటున్నారు.
వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి దయాకర్ రెండో అభ్యర్థి.వామపక్షాలు తమ అభ్యర్థిగా ప్రొఫెసర్ వినోద్ కుమార్ని చాలా రోజుల క్రితమే ప్రకటించాయి.
ఇక కాంగ్రెస్, బీజేపే తమ వారిని ప్రకటించాల్సి ఉంది.