కరోనా కంగారుతో జనాలు చాలా రోజుల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు.నిన్న మొన్నటి దాకా పంజా విసిరిన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది.
త్వరలోనే థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రళయం ముంచుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దేశాలతో సంబంధం లేకుండా చాలా ప్రాంతాల్లో ఇలాగే జరుగుతోంది.కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాల ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి.
మాస్కులు లేకుండా జనావాసాల్లో సంచరిస్తే భారీగా జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నా… కానీ కొంత మంది నిర్లక్ష్యపు ధోరణి వదలడం లేదు.మాస్కులు లేకుండానే , యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ….
తిరుగుతున్నారు.ఎంతలా చెప్పిన వినకుండా తమ ప్రాణాలనే కాకుండా పక్కవారి ప్రాణాలను కూడా రిస్క్ లో పడేస్తున్నారు.
ఇలాగే స్పెయిన్ దేశంలో మాస్కు లేకుండా రైలెక్కిన ఓ యువకుడికి రైలులో ఉన్న జనాలు చుక్కులు చూపించారు.ఇంతకీ ఏం జరిగిందంటే…
స్పెయిన్ లో ఓ యువకుడు మాస్కు లేకుండా రైలు లోపలికి ప్రవేశించాడు.
దీంతో ఆగ్రహించిన రైలులోని జనం సదరు యువకుడిని కిందకి తోసేశారు.మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తూ… అతడిని కిందకి దించేశారు.
మాస్కు లేకుండా ప్రయాణిస్తూ… నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా దిగాలని తోటి ప్రయాణికులు చెప్పినా అతను కిందకు దిగనని మొండికేయడంతో అక్కడ ఉన్న ఇద్దరు లేడీ ప్రయాణికులు అతడిని బలవంతంగా కిందకు నెట్టేశారు.ప్రస్తుతం ఇలా మాస్కు లేకుండా రైలులో ప్రయాణించడంతో కిందకు తోసేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.అలా మాస్కు ధరించకుండా రైలెక్కిన వ్యక్తికి తగిన శాస్తి జరిగిందని కొంత మంది అంటుండగా… కేవలం మాస్కు లేకపోతే మరీ అంతలా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.