గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్ లో విధ్యుత్ షాక్ తగిలి నలుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది.రైలు దిగుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.
ఒక్కసారిగా షాక్ కి గురి అవ్వడం తో ఆ నలుగురు ప్రయాణికులు కింద పడిపోవడం తో గాయపడ్డారు.దీనితో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
అయితే వారందరి పరిస్థితి బాగానే ఉందని ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే అసలు ఈ ఘటన ఎందుకు చోటుచేసుకుంది అన్న దానిపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వారంతా కూడా ఒక్క భోగి లో నుంచే కిందకు దిగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని,ఒకవేళ రైలు నుంచి ప్రసారమయ్యే విద్యుత్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండి ఉంటె అన్నీ భోగీ లలో ఈ ఘటన చోటుచేసుకొనేది అని ఈ నేపథ్యంలో ఈ ఘటన పై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.