రైలు దిగుతుండగా విద్యుత్ షాక్ కు గురైన ప్రయాణికులు.... గాయాలు

గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్ లో విధ్యుత్ షాక్ తగిలి నలుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది.రైలు దిగుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.

 Passengers Got Electric Shock-TeluguStop.com

ఒక్కసారిగా షాక్ కి గురి అవ్వడం తో ఆ నలుగురు ప్రయాణికులు కింద పడిపోవడం తో గాయపడ్డారు.దీనితో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

అయితే వారందరి పరిస్థితి బాగానే ఉందని ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే అసలు ఈ ఘటన ఎందుకు చోటుచేసుకుంది అన్న దానిపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వారంతా కూడా ఒక్క భోగి లో నుంచే కిందకు దిగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని,ఒకవేళ రైలు నుంచి ప్రసారమయ్యే విద్యుత్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండి ఉంటె అన్నీ భోగీ లలో ఈ ఘటన చోటుచేసుకొనేది అని ఈ నేపథ్యంలో ఈ ఘటన పై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube