బాలీవుడ్ లో రియలిస్టిక్ స్టోరీలకి, బయోపిక్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా విద్యా బాలన్ మారిపోయింది.రీసెంట్ గా గణిత మేధావి శకుంతలాదేవి బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విద్యా బాలన్ మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
డిజిటల్ మీడియాలో రిలీజ్ అయిన ఈ సినిమాకి అద్బుతమైన ప్రేక్షకాదరణ వచ్చింది.ఇక ఇప్పుడు విద్యాబాలన్ దృష్టి మరో బయోపిక్ పై పడినట్లు కనిపిస్తుంది.
ఆ దిశగా ఆమె పయత్నాలు కూడా మొదలు పెట్టింది.ఆ బయోపిక్ కథ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పర్వీన్ బాబీది.
ఆమె జీవీత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని జర్నలిస్ట్ కరీష్మా బాయ్ ఇటీవల విడుదల చేశారు.పర్వీన్ బాబీ 2005 సంవత్సరంలో మరణించారు.
ఆమె జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, మలుపులు, ఆటుపోట్లతో బయోపిక్ కథకి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి .పర్వీన్ బాబీ గురించి జర్నలిస్ట్ కరీష్మా చెబుతూ పర్వీన్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.ఆమె సినిమా కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు, ఓ ఆధ్యాత్మిక గురువు ఆమెను సినిమాలో నటించవద్దని చెప్పడం లాంటి ట్వీస్ట్లు ఆమె జీవితంలో అనేకం ఉన్నాయి.కాగా, నటి పర్వీన్ గొప్ప నటి అంటూ విద్యాబాలన్ కొనియాడారు.
ఈ నేపధ్యంలో జర్నలిస్ట్ రాసిన బుక్ ఆధారంగా పర్వీన్ జీవిత చరిత్రని తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఆలోచనతో విద్యా బాలన్ ఉందని తెలుస్తుంది.కథ మొత్తం చదివిన తర్వాత తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే సినిమా రూపంలోకి మార్చేసిందుకు సిద్ధంగా ఉంది.
ఇక తన భర్త నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ఇప్పటికే విద్యా బాలన్ మొదలు పెట్టినట్లు బాలీవుడ్ లో టాక్