నిన్న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా హరికృష్ణ గురించి నందమూరి అభిమానులకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అన్నగారి కుటుంబంలో మొదట పరిచయమైన వ్యక్తి హరికృష్ణ అని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.
ఆగష్టు 30వ తేదీన నా మనవరాలి పెళ్లి అని పెళ్లికి వచ్చి అక్షింతలు వేయాలని కోరగా మనవారలిని పెళ్లికూతురును చేసిన రోజున హరికృష్ణ అక్షింతలు వేసి వెళ్లారని ఆగష్టు 29వ తేదీన విషాదం చోటు చేసుకుందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
నా సోదరుడు లేడు అనే మాటను తాను తట్టుకోలేకపోయానని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు.అరవింద సమేత ఆడియో ఫంక్షన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్లు చూస్తే ఆ కళ్లలో నాన్న లేరనే బాధను చూసి గుండె తరుక్కుపోయిందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
అరవింద సమేత సినిమాలో కూడా నాన్న పాత్ర చనిపోతుందని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
ప్రపంచంలో బంగారం లాంటి మనుషులు కొంతమంది అని అలాంటి బంగారం లాంటి మనిషి హరికృష్ణ అని పరుచూరి పేర్కొన్నారు.తనను హరికృష్ణ పగో అని పిలిచేవారని ఒకసారి తన దగ్గరకు వచ్చి పార్టీ పెడదామని అడిగారని అయితే ఆ నిర్ణయం కరెక్ట్ కాదని తాను చెప్పానని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.
ఆ తర్వాత హరికృష్ణ రియలైజ్ అయ్యారని తనకు హరికృష్ణ జయంతి మాత్రమే గుర్తుంటుందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.విజయవాడ నుంచి నార్కేట్ పల్లికి వాహనాన్ని హరికృష్ణ గంటా 40 నిమిషాల్లో నడిపారని అయితే అదే వేగం హరికృష్ణ ప్రాణాలు పోవడానికి కారణమైందని పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులలో చెప్పుకొచ్చారు.