ఈ ఏడాది విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో ఆచార్య సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.కొరటాల శివ డైరెక్షన్ లో భారీ అంచనాలతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినా ఆ సన్నివేశాలు సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు.ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆచార్య మూవీ చూస్తున్న సమయంలో మరో మలుపు మూవీ గుర్తుకు వచ్చిందని సినిమాగా చూస్తే ఆచార్యలో ఎటువంటి తప్పు లేదని అయితే కథను నడిపించిన తీరు వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.చరణ్ రోల్ ఫస్టాఫ్ లో ఉండి ఉంటే బాగుండేవని సస్పెన్స్, సెంటిమెంట్ ఒకేచోట ఇమడవని ఆయన కామెంట్లు చేశారు.
చరణ్ సిద్ధ రోల్ లో నటించకుండా ఉండి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.
చిరంజీవి కథ 90 శాతం ఫ్లాష్ బ్యాక్ 10 శాతం ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండి ఉండేదని ఆయన అన్నారు.
ఈ సినిమాకు ఆచార్య టైటిల్ ను ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి ఈ సినిమాలో డ్యాన్స్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్ల విషయంలో చాలామంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.
సోనూసూద్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించారనే సంగతి తెలిసిందే.సోనూసూద్ పోషించిన విలన్ రోల్ కూడా ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.ఆచార్య సినిమా వల్ల కొరటాల శివ తన రెమ్యునరేషన్ ను పూర్తిస్థాయిలో నష్టపోయారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఆచార్య ప్రస్తుతం అమెజన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉందనే సంగతి తెలిసిందే.