పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.కొందరు ఆయన రాజకీయ ప్రత్యర్థులు పవన్ రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకోవడంపై విమర్శలు చేస్తున్నారు.
జగన్ పాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటాను అంటూ గతంలో పవన్ ప్రకటించాడు.ఆ ప్రకటన ముందుకు తీసుకు వచ్చి జగన్ పాలన బాగుండటం వల్లే పవన్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు.
ఆయనకు మరే పని ఇప్పుడు రాజకీయాల్లో లేదు అందుకే సినిమాలు చేస్తున్నాడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఇదే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అభినందనీయం.గతంలో ఎన్టీఆర్ సీఎంగా చేసిన తర్వాత ఓడిపోయారు.
ఆ సమయంలో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశాడు.మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడంలో ఆ సినిమా కూడా కీలకంగా పని చేసింది.
అందుకే పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలను చైతన్య పర్చేలా ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాలు చేయాలంటూ ఈ సందర్బంగా పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు.రోడ్లమీద తిరుగుతూ ప్రజల్లో చైనత్యం తీసుకు వచ్చే కంటే సినిమాల్లో తాను చెప్పాలనుకున్నది చెప్తే ప్రజలు ఎక్కువగా రీచ్ చేసుకుంటారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.