నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వం సెషన్స్ సజావుగా జరిగేలా చూడాలని అఖిలపక్షానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
మరోపక్క పాలక అదే రీతిలో ప్రభుత్వం పక్షాలు ఎవరికివారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, పెండింగ్ నిధులు.
అదేరీతిలో జల జగడం, విశాఖ ఉక్కు వంటి విషయాలపై పార్లమెంటులో గళం వినిపించే రీతిలో వ్యూహాలు సిద్ధం చేసుకున్నరు.
ముఖ్యంగా జల జగడం విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ ఎంపీలకు ఎవరికి వారు తమ వాదన వినిపించే రీతిలో దిశానిర్దేశం చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆర్ అండ్ ఆర్ పోలవరం ప్యాకేజి విషయంలో కేంద్రం కావాలనే కాలయాపన చేస్తుంది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.ఏదిఏమైనా ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు గట్టిగానే కేంద్రన్నీ నిలదీయడానికి రెడీ అవ్వుతున్నట్లు తెలుస్తోంది.