వారసుడి గెలుపు కోసం ఆమె అనేక కలలు కన్నారు.తాను సైతం అన్నీ వదులుకున్నారు.
చంద్రబాబు ఏం చెబితే అది విన్నారు.అయితే.
సాధించింది మాత్రం ఏమీ కనిపించడం లేదు.వారసుడు పుంజుకుం టాడా? లేక .పరిస్తితి ఇంతేనా? అనేది పెద్ద సమస్యగా మారింది.విషయంలోకి వెళ్తే.
అనంతపురం జిల్లా పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాం రాజకీయ పరిస్థితి ఏంటనే చర్చ స్థానికంగా బలంగా వినిపిస్తోంది.గత ఏడాది ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తాడని అనుకున్నా.
ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
తన కుమారుడి కోసం.
మాజీ మంత్రి సునీత ఇక్కడి సీటును సైతం త్యాగం చేశారు.ఆమె పోటీ చేసి ఉంటే.
ఫలితం అనుకూలంగా వచ్చేదనే సంకేతాలు ఉన్నాయి.అయినప్పటికీ.
వారసుడి గెలుపు చూసుకో వాలని తపించారు.ఎన్నికలు ముగిసి.
ఏడాదిన్నర అయింది.అయితే.
ఇప్పటి కీ శ్రీరాం పుంజుకోలేక పోతున్నారు.పైగా ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి దూకుడు.
శ్రీరాం రాజకీయాలకు గండంగా మారిందని అంటున్నారు టీడీపీ నాయకులు.ఇటీవల శ్రీరాం నిర్వహించాలని అనుకున్న కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ఇక పరిటాల ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే బీసీ వర్గాలు కూడా ఆ కుటుంబానికి దూరమయ్యాయి.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరిని పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం.అదే సమయంలో పార్టీ తరఫున కూడా కార్యక్రమాలు నిర్వహించినా.నిన్న మొన్నటి వరకు తన వెంటే తిరిగిన వర్గం కూడా ఇప్పుడు దూరమైంది.మరోవైపు.అధికారుల నుంచి నిత్యం ఫోన్లు.
బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని శ్రీరాం వర్గం చెబుతోంది.
పాత కేసులు తిరగదోడడం, కొత్తగా కేసులు పెట్టేందు కు కూడా రెడీ కావడంతో నియోజకవర్గంలోని కేడర్ వైసీపీ బాట పడుతోంది.దీంతో పరిటాల శ్రీరాం పేరెత్తేందుకు కూడా ఇక్కడ యువత భయపడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.ఎవరైనా శ్రీరాం పేరిట ఫ్లెక్సీ కడితే.
కరోనా నిబంధన పేరిట కేసు నమోదు చేస్తున్నారట.దీంతో అందరూ సైలెంట్.
మరి పరిస్థితి ఇలానే ఉంటుందా? మారుతుందా? అనేది సునీత మదిలో ఆవేదన.చూడాలి ఏం జరుగుతుందో.!
.