అనంతపురం జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పొలిటికల్ ఫ్యామిలీ.పరిటాల కుటుంబం.
రవి నుంచి నేటి శ్రీరాం వరకు మంత్రి సునీత సహా అందరూ ప్రజలకు చేరువయ్యారు.ప్రజానాడి పట్టారు.
పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిటాల సైన్యం ఇప్పటికీ ప్రజాసేవలో పునీతం అవుతూనే ఉంది.రవి అస్తమించిన తర్వాత.
రాజకీయంగా ఆయన సతీమణి సునీత వరుస విజయాలు సొంతం చేసుకున్నారు.గత చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.
ఇక, గత ఏడాది ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దింపాలని నిర్ణయించిన ఆమె రెండు నియోజకవర్గాలను తమకు ఇవ్వాలని బాబుకు విజ్ఞప్తి చేశారు.
రాప్తాడు నుంచి తాను పోటీ చేస్తానని, పెనుకొండను పరిటాల శ్రీరాంకు ఇవ్వాలని అన్నారు.
అయితే, బాబు రాప్తాడు మాత్రమే ఇచ్చారు.ఇక ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు.
భారీ అంచనాలు ఉన్నప్పటికీ.శ్రీరాం విజయం సాధించలేదు.
ఇక, అప్పటి నుంచి ఈ కుటుంబం తటస్థంగా ఉంటోంది.తమకు పెనుకొండ ఇచ్చి ఉంటే బాగుండేదని పలుమార్లు.
సునీత తమ సన్నిహితులతో వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.
ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిటాల కుటుంబానికి ఇప్పుడు చంద్రబాబు ఏదొక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ క్రమంలో తెలుగు యువత అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరాంకు అప్పగించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత.
తెలుగు యువత అధ్యక్ష పదవిపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.అయితే, ఇక్కడే మరో కోణం కూడా వినిపిస్తుండడం గమనార్హం.
పార్లమెంటు ఇంచార్జ్ పదవిని పరిటాల కుటుంబం ఆశించిందని, జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలకు ఇంచార్జులను నియమించాల్సి ఉండడంతో తమకు ఒకటి ఇవ్వాలని కోరిందని అంటున్నారు.అయితే, ఇది ఇవ్వకుండా.
తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని బాబు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.మరి, బాబు నిర్ణయాన్ని పరిటాల కుటుంబం ఎలా స్వీకరిస్తుందో చూడాలి.
ఏదేమైనా.ఇప్పటికైతే.
శ్రీరాంకు ఇది మంచి గుర్తింపేనని అంటున్నారు పరిశీలకులు.