టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన్ను చంద్రబాబు ఏపీకి భవిష్యత్తులో సీఎం చేయాలని ఎంత తాపత్రయ పడుతున్నా లోకేష్కు ఇప్పటకీ మాట్లాడడం రావడం లేదు.
లోకేష్ తత్తర పాటు ప్రసంగాలు ఇప్పటకీ కామెడీగానే ఉంటాయి.అసలు ఒకోసారి లోకేష్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు.
ఈ విషయంలో మామ బాలయ్యకు బాలయ్యే, లోకేష్కు లోకేషే సాటి అన్న సెటైర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీలోనే మరో యువనేత లోకేష్కు పోటీ వస్తున్నారు.
ఆ యువనేత ఎవరో కాదు పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్.గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఎంతో ఆర్భాటంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
సునీత మంత్రిగా ఉండి కూడా తన సీటు త్యాగం చేసి మరీ శ్రీరామ్ను రాఫ్తాడు బరిలోకి దింపింది.వీరుడు శూరుడు అని ప్రగల్భాలు పోతే చివరకు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో శ్రీరామ్ ఏకంగా 27 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయాడు.
ఓ వైపు రాఫ్తాడులో వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి దూసుకు పోతుంటే పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో ఓడిపోయాక ఇళ్లు దాటి బయటకు రాని పరిస్థితి.ప్రకాశ్ రెడ్డి జలవనరుల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తూ నియోజకవర్గాన్ని తాగు, సాగునీటి పరంగా తిరుగులేని విధంగా తీర్చిదిద్దుతూ జనాల్లో క్రేజ్ తెచ్చుకుంటుంటే శ్రీరామ్ చివరకు సొంత కేడర్లో కూడా పట్టు కోసం విలవిల్లాడుతోన్న పరిస్థితి.
యేడాదిగా బయటకు రాని శ్రీరామ్ ఇటీవల బయటకు వచ్చి పసలేని ప్రసంగం, అతుకుల బొంతలాంటి మాటలు చెప్పడంతో పాటు పూర్తిగా తడబడడంతో అందరూ శ్రీరామ్ మరోసారి లోకేష్ను గుర్తు చేశారే అని సెటైర్లు వేస్తున్నారు.ఇప్పుడు శ్రీరామ్ మాట్లాడిన ఈ తత్తరమాటు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి తెలుగుదేశంలో లోకేష్కు పోటీగా మరో నేత వచ్చాడే అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.