ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నటి పరిణీతి చోప్రా గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.
అంతేకాకుండా తన నటనతో ఎన్నో ఫిలింఫేర్ జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది.సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకునేది.
2011 లో లేడీ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాలో తొలిసారిగా బాలీవుడ్ లో పరిచయము కాగా ఈ సినిమాలో తన నటనతో బెస్ట్ యాక్టర్ గా అవార్డు పొందింది.ఆ తర్వాత వరుస ఆఫర్ లతో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో కూడా నటించింది.రీభూ దాస్ గుప్త దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమాలో నటించగా.అది నెట్ ఫ్లెక్సీలో విడుదలైన సంగతి తెలిసిందే.
తాజాగా పరిణితి చోప్రా ‘ డూ యూ రిమెంబెర్ ‘ అనే ఛాలెంజ్ లో పాల్గొనగా.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.తన ఫస్ట్ కిస్, డేట్ గురించి మాట్లాడుతూ.సరే ఎప్పుడు డేట్ కి వెళ్ళలేదట.18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ఒకరిని ముద్దుపెట్టుకున్నాను తెలిపింది.అదే తన తొలి ముద్దని తెలిపింది.
తాను చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను ఎంతగానో ప్రేమించానని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా తాను హీరోయిన్ గా నటించిన తొలి సినిమా లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ విడుదల తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ తనకు అందిందని.ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని తెలిపింది.అంతే కాకుండా ఆ గిఫ్ట్ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది అని తెలిపింది.