సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
మే మొదటి వారంలోనే ‘బ్రహ్మ్సోతవం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ వెంటనే తమిళ సూపర్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్బాబు చేయనున్నాడు.
తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా భారీ క్రేజ్ ఉన్న మురుగదాస్తో సినిమా కోసం మహేష్బాబు ఇప్పటికే డేట్లు ఇచ్చాడు.వంద కోట్లకు పైబడిన బడ్జెట్తో ఈ సినిమాను ఠాగూర్ మధు మరియు నల్లమల్లపు బుజ్జిలు నిర్మించబోతున్నారు.
ఇక ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో సైతం ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
అందుకే సాధ్యం అయినంత వరకు మూడు భాషలకు చెందిన నటీనటులను ఈ చిత్రంలో నటింపజేయాలని మురుగదాస్ భావిస్తున్నాడు.అందుకే ఈ చిత్రంలో మహేష్బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే ఈమె మహేష్తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సౌత్లో ఇప్పటి వరకు పరిణితి చోప్రా నటించింది లేదు.
బాలీవుడ్లో స్టార్స్తో నటించిన ఈమె మహేష్తో నటించేందుకు ఓకే చెప్పి సౌత్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వచ్చే నెలలో మహేష్, మురుగదాస్ల సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయి.