రచయిత, నటుడు పరచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది.అతని సతీమణి విజయలక్ష్మి(74) మరణించారు.
దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.రచయిత పరచూరి వెంకటేశ్వరరావు భార్య మరణంతో శోకసధ్రంలో మునిగారు.
మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను దక్కించుకున్నారు పరచూరి బ్రదర్స్.
నటులుగా, మాటల రచయితగా పరచూరి వెంకటేశ్వరరావు, తమ్ముడు పరచూరి గోపాల కృష్ణతో కలిసి సినిమాలు చేశారు.తెలుగు పరిశ్రమలో సినిమాలకు కథలు, మాటలు, స్ర్కీన్ ప్లే చేశారు.
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను తీస్తూ ప్రేక్షకులను అలరించేవాళ్లు.ఇదిలా ఉండగా పరచూరి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
పరచూరి వెంకటేశ్వరరావు భార్యకు గుండెపోటు వచ్చింది.దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అంబులెన్స్ సాయంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.మార్గమధ్యలోనే మరణించారని నిర్ధారించారు.దీంతో పార్థీవ దేహాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈ మేరకు విజయలక్ష్మీ మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
పరచూరి వెంటేశ్వరరావుకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కోరుతున్నారు.