ఇటీవల సమాజంలో బంధాలకు పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది.ఒకప్పుడు కన్న తల్లి,చెల్లి,తండ్రి,తోడబుట్టిన వారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం లో ఒక భాగం అయిపోయే వారు.
కానీ ఇప్పటి ట్రెండ్ లో మాత్రం నేను,నా భార్య,నాబిడ్డలు ఇదే కుటుంబం అయిపోతుంది.ఒక తల్లికి తన బిడ్డకు ప్రేమ ఉండడం లేదు,అలానే ఒక బిడ్డకు తన తల్లిపై ప్రేమ ఉండడం లేదు.
అందరూ కూడా కర్కశంగా మారిపోయారు.ఇటీవల 8 ఏళ్ల చిన్నారి తన అక్రమ సంబంధం గురించి తెలుసుకుంది అని ఆ కన్న తల్లి తన ప్రియుడి చేత ప్రాణాలు తీయించిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా వరంగల్ జిల్లా లో కూడా ఒక దారుణ ఘటన వెలుగు చూసింది.కర్కశ తల్లిదండ్రులు కలిసి కన్న కొడుకునే సజీవ దహనం చేశారు.
ఈ ఘటన వరంగల్ జిల్లా దామెర మండలంలో చోటుచేసుకుంది.స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
ముస్తాలపల్లికి చెందిన కడారి మహేష్ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కూతురు ఇంటర్ చదువుతుండగా.
కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు.అయితే మద్యానికి బానిసైన మహేష్.
నిత్యం తాగివస్తూ భార్యను వేధించసాగాడు.దీంతో భర్త టార్చర్ భరించలేక.
కొద్ది నెలల క్రితం భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో అప్పటి నుంచి కూడా మహేష్ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు.
అయితే వారిని కూడా నిత్యం మద్యం కోసం డబ్బుకావాలంటూ వేధించడం తో పాటు వారిపై దాడి కూడా చేయడం మొదలు పెట్టాడు.అయితే ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో వారిపై దాడికి పాల్పడ్డాడు.
దీంతో కొడుకు చేస్తున్న టార్చర్ భరించలేక ఆ తల్లిదండ్రులు దారుణానికి ఒడిగట్టారు.
మద్యం మత్తులో ఉన్న మహేష్ చంద్రపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తుంది.మంటల్లో మహేష్ సజీవదహనమై.అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మహేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.