వింటుంటే ఆశ్చర్యంగా వుంది కదా.మీరు విన్నది నిజమే.
దాదాపు 15 సంవత్సరాలుగా ఓ వార్తా సంస్థలో( News agency ) పనిచేస్తున్న ఆమెకు వుద్యోగం అంటే చిరాకు కలిగింది.ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రపోయే వరకూ నిరంతరం ఆ సంస్థలో పనిచేయడం వలన జీవితం ఓ యాంత్రికంగా భావించింది ఆ మహిళ.
ఉద్యోగంలో బిజిబిజీగా గడపడంతో కుటుంబంతో గడిపే సమయం ఆమెకి చిక్కేది కాదు.స్నేహితులు లేరు, బంధువుల గురించి తెలుసుకోవడానికి సమయం లేదు, వీటికి తోడు ఆఫీస్ లో వత్తిడి.
తత్ఫలితంగా బాధపడుతున్న ఆమెకి తన తల్లిదండ్రులే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
అవును, ఆమెని ఉద్యోగం మానేసి, రోజంతా వాళ్ళతోనే సమయం గడపమన్నారు.అవసరమైన పనులు చేస్తూ వారికి ఆసరాగా ఉండమన్నారు.అయితే ఊరికే కాదండోయ్.
అలా ఉంటే ఆమెకి నెలకు 570 డాలర్లు అంటే దాదాపు 47 వేల రూపాయలను చెల్లిస్తామని చెప్పారు.దీంతో ఆ కూతురు తన ఉద్యోగానికి సంతోషంగా గుడ్ బై చెప్పేసి, ఇప్పుడు ఫుల్ టైం కూతురుగా ఉద్యోగం చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.నియానన్ అనే ( Nianan )40 ఏళ్ల మహిళ ఒక వార్తా సంస్థలో 15 సంవత్సరాలు పనిచేయగా రొటీన్ జీవితంతో అలసిపోయింది.ఈ క్రమంలోనే ఆమెకి ఆమె తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. తమ కూతురు ఉద్యోగం వదిలి తమకు కూతురిగా ఉద్యోగం చేయాలనీ సూచించారు.దీంతో తన తల్లిదండ్రులకు ఆమె ఇపుడు సంపూర్ణమైన కూతురిగా మారిపోయింది.ప్రస్తుతం ఆమె ఆనందంగా తన దినచర్యను స్టార్ట్ చేస్తోంది.
వారి అవసరమైన పనులు చేస్తూ వారికి చేదోడువాడుగా ఉంటోంది.నెలాఖరులో ఎక్కడికైనా విహారయాత్రకు( vacation ) వారిని తీసుకు వెళ్తుంది.
ఇలా తన తల్లిదండ్రుల చుట్టు తాను తిరగడం ఒక చికిత్స వంటిదే అని ఆమె చెబుతున్నారు.అవును, ఆమె ప్రస్తుతం జీవితాన్ని అనుభవిస్తోంది.