పెరిగిన టెక్నాలజీని కొందరు పిల్లలు వినియోగించుకుని మంచి ప్రతిభను కనబర్చుతుంటే మరికొందరు మాత్రం టెక్నాలజీ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.కొందరు కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు.
స్వల్ప కాలిక సంతోషాలు మరియు ఇతర విషయాల కోసం నెటిజన్స్ చాలా చీప్గా ప్రవర్తిస్తున్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు కొనివ్వాలంటే భయపడాల్సిన పరిస్థితి.
పిల్లలు అందులో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో వారి భయం.అలా అని ఫోన్లు కొనివ్వకుండా ఉండలేరు.
ప్రేమలు.దోమలు అంటూ కొందరు యువతి తప్పుదారి పడుతున్నారు.అవతలి వారి ప్రోద్బలమో లేదంటే మోజో తెలియదు కాని కొందరు అమాయకంగా బట్టలు లేకుండా ఫొటోలు దిగి పంపిస్తున్నారు.ఆ ఫొటోలు కాస్త బయటకు లీక్ అవ్వడంతో జీవితాలు నాశనం అవ్వడం.
చనిపోవడం వరకు వస్తుంది.ఈ మద్య కాలంలో ఈ ఇలాంటి వార్తలు చాలా తరుచూ చూస్తున్నాం.
అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.ఆ ఫొటోలను చూపించి కొందరు బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం.
ఇప్పుడు ఆ ఫొటోలకు చెక్ పెట్టే కొత్త ఫోన్ వచ్చింది.జపాన్ కంపెనీ బట్టలు లేకుండా ఉంటే వారిని ఫొటో దిగనివ్వదు.కనీసం టాప్ లేకున్నా కూడా ఆ ఫొటోలు ఇవ్వడం లేదు.ఇది చాలా కొత్తగా ఉంది.టోన్ ఇ 20 అనే మోడల్లో ఈ కొత్త ఫీచర్ను కంపెనీ ప్రవేశపెట్టింది.దీని రేటు కూడా అందుబాటు దరలోనే ఉంది.
ఇండియన్ మార్కెట్లోకి ఇంకా రాలేదు కాని 15 వేల లోపే ఉంటుందని అంటున్నారు.మొత్తానికి ఇలాంటి ఫోన్తో తల్లిదండ్రులు కాస్త రిలాక్స్ అవ్వొచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.