ఈ మధ్య డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంది.అక్రమార్కులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ను ఇండియాలోకి చేరవేస్తూనే ఉన్నారు.
పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా దీని అక్రమ రవాణాను మాత్రం ఆపలేకపోతున్నారు.అయితే మొన్నటికి మొన్న ఏదో ఒక రకంగా రవాణా చేసేవారు.
కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వాడేస్తున్నారు.కాగా ఇప్పుడు కూడా ఇలాంటి వార్తనే ఒకటి వైరల్ అవుతోంది.
ఏకంగా సముద్రాన్ని వారు రవాణాకు వాడేసుకోవడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
అమెరికా దేశంకు చెందిన ఓ వ్యక్తి టైమ్ పాస్ కోసం సముద్రంలోకి బోటింగ్కు వెళ్లాడు.
కాగా అతను అలా కాసేపు బోటింగ్ చేస్తున్న సందర్భంలోనే అక్కడ ఓ ఆకారంలో పార్శిల్ కనిపించింది.ఏంటో అని అతను ఆఫీసర్లకు ఇన్షార్మ్ చేశాడు.కాగా దాన్ని ఓపెన్ చేసి చూసిన పోలీసులకు షాక్ తగిలింది.దాదాపు అందులో 7.5 కోట్ల విలువైన డ్రగ్స్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ పార్శిల్ను యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి పరీక్షించినట్టు తెలుస్తోంది.
దీన్నంతా కూడా వారు రికార్డు చేయడం గమనార్హం.
ఇలా రికార్డు చేస్తూ వారు పార్శిల్ను ఓపెన్ చేసి చూడగా.అందులో 24 ఇటుకల రూపంలో కొకైన్ సరఫరా చేయడం సంచలనంగా మారింది.ఇందులో దాదాపు 30 కిలోల వరకు కొకైన్ ఉందని, దాన్ని మొత్తం సీజ్ చేసినట్టు పోలీసులు వివరించారు.
ఇక తమకు సమాచారం అందించిన వ్యక్తిని పోలీసులు అభినందించారు.కాగా ఇటీవల ఫ్లోరిడా ఏరియాలో ఎక్కువగా డ్రగ్స్ పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇలా వరుసబెట్టి డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.