టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
‘సర్కారు వారి పాట’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికంటే ఎక్కువ ఆలస్యంగా ప్రారంభం అవుతుండటంతో దర్శకుడు పరశురామ్ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ప్లే విషయంలో పరశురామ్ ఎలాంటి అవతకతవకలు జరగకుండా ప్లాన్ చేస్తున్నాడట.
ఎప్పుడు ఏ షెడ్యూల్ షూటింగ్ చేయాలో, అది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో లాంటి విషయాలను పక్కా ప్లానింగ్తో పరశురామ్ రాసుకుంటున్నాడట.
మొత్తానికి లాక్డౌన్ పుణ్యమా అని సర్కారు వారి పాట చిత్రం కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశం తనకు లభించిందని దర్శకుడు పరశురామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కథను పూర్తిగా ఆర్ధిక నేరాల చుట్టూ రాసుకున్న పరశురామ్, మహేష్ను సరికొత్త లుక్లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.