టాలీవుడ్లో గీతా గోవిందంసినిమాతో అదిరిపోయే డైరెక్టర్గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు పరశురామ్ పెట్ల.ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటఅనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.
ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ అంచనాలను సర్కారు వారి పాట ఫస్ట్ గ్లింప్స్ రెట్టింపును చేసింది.
దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు పరశురామ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే చర్చ అప్పుడే ఇండస్ట్రీలో మొదలైంది.
ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని ఈ డైరెక్టర్తో తెరకెక్కించే అవకాశం ఎక్కువగా ఉందని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.అయితే ఈ డైరెక్టర్ మాత్రం తన నెక్ట్స్ మూవీని బన్నీతో కాకుండా మరో హీరోతో తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో దర్శకుడు పరశురామ్ ఓ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు.దీంతో సర్కారు వారి పాట తరువాత పరశురామ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంది.
ఏదేమైనా బన్నీ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ను పరశురామ్ వదులుకుంటాడా లేక చైతూ సినిమాను అనుకున్నట్లుగానే తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.మొత్తానికి సర్కారు వారి పాట చిత్రంతో స్టార్ డైరెక్టర్గా మారుతున్న పరశురామ్, ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి అంటున్నారు ఆడియెన్స్.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబును అల్ట్రా స్టైలిష్ లుక్లో చిత్ర యూనిట్ చూపిస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
సర్కారు వారి పాట చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.