సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించినా వీక్ డేస్ లో మాత్రం బుకింగ్స్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.మరోవైపు ఈ సినిమా కలెక్షన్లు నిజం కాదని సర్కారు వారి పాట 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఏ మాత్రం నిజం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే సర్కారు వారి పాట సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
కళావతి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కు సినిమాలో హీరో పాత్ర 35000 డాలర్లు అప్పుగా ఇవ్వగా ఆ తర్వాత 10,000 డాలర్లు మాత్రమే రిటర్న్ ఇవ్వాలని అడుగుతాడు.
ఈ లాజిక్ ఏంటో అర్థం కాలేదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.అయితే దర్శకుడు పరశురామ్ వైరల్ అవుతున్న విమర్శలపై తనదైన శైలిలో స్పందించి క్లారిటీ ఇచ్చారు.సర్కారు వారి పాట సినిమాలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పారు.
మొదట 10,000 డాలర్లను మహేష్ అప్పుగా ఇచ్చారని తర్వాత మాత్రం మహేష్ ఆమెపై ప్రేమతో ఇవ్వడంతో ఆ డబ్బును రిటర్న్ అడగలేదని పరశురామ్ వెల్లడించారు.
ఈ లాజిక్ ను ఇప్పుడు చెప్పి లాభం ఏమిటని సినిమా విడుదలైన సమయంలోనే ఈ లాజిక్ ను చెప్పి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.తర్వాత సినిమాలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పరశురామ్ జాగ్రత్త పడాల్సి ఉంది.
గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న పరశురామ్ కు సర్కారు వారి పాట కెరీర్ పరంగా ప్లస్ కాలేదు.చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలతో విజయాలను అందుకుంటున్న పరశురామ్ పెద్ద హీరోలతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరశురామ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.