పెళ్లిళ్లలో .ఫంక్షన్లలో … ఇళ్లల్లో ఎక్కడైనా సరే … సాంబారు కామన్ ఐటమ్.
మరి సాంబారు అన్నం ఉంది అంటే… కరకరలాడే అప్పడాలు కామన్.మరి ఇప్పుడు ఆ అప్పడాల మీద కూడా కన్నేసేసాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.అసలే ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు ప్రచారానికి కాదేది అనర్హం అనేలా అప్పడాల మీద కూడా ప్రచారం మొదలుపెట్టేసింది టీడీపీ.తాజాగా… చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా.ప్రజలకు భోజనంతోపాటు అప్పడాలు వడ్డించారు.అయితే ఈ అప్పడాలపై ‘థాంక్యూ సీఎం గారు.ది లీడర్’ అని రాసి సీఎం చంద్రబాబు ఫొటోలు ముద్రించి ఉన్నాయి.
ఈ అప్పడాలు చుసిన ప్రజలు విస్తుపోయారు.మరీ ఈ రేంజ్ లో ప్రచారం అవసరమా బాబు అంటూ… సెటైర్లు వేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో దీనిపై సెటైర్ల వర్షం కురుస్తోంది.
ఇక బాబు మీద ఎప్పుడు అవకాశం దొరుకుతుందా తిట్ల వర్షం కురిపిద్దామా అని కాచుకు కూర్చునే ప్రతిపక్షాలు ఈ విషయంలో స్పీడ్ గానే రియాక్ట్ అయ్యాయి.ఏపీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ అంశంపై ట్విట్టర్లో సెటైర్లు సంధించారు.‘ఆశ-దోచే-అప్పడం బాబు.! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికి అప్పడాలపై,టిష్యూ పేపర్ లపై బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్.! ఇదేం పిచ్చి బాబు!?’ అని ట్వీట్ చేసారు.