మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట లభించింది.జూన్ 23 నాటికి అన్నాడీఎంకే పార్టీలో ఉన్న స్థితినే పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇదివరకు జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.అనంతరం తాజాగా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణ జయచంద్రన్ బెంచ్ కు బదిలీ చేశారు.న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనడం పట్ల కోర్టు ఆగ్రహాన్ని కూడా పన్నీర్ సెల్వం ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీనికి ఆయన క్షమాపణ కోరారు.అయినప్పటికీ, పిటిషనర్ కోరినట్టు జడ్జిలో మార్పు జరిగింది.